బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై బీఆర్ఎస్ సభా నిబంధలు ఉల్లంఘన-ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ నిషికాంత్ దూబే ఉద్దేశ పూర్వకంగా సభను తప్పుదారి పట్టించారని అభ్యంతరం వ్యక్తం చేసింది. రూల్ 222 కింద స్పీకర్కు ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చింది బీఆర్ఎస్.
లోక్సభలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం 86 వేల కోట్లు ఇచ్చిందని నిషికాంత్ దూబే అన్నారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని.. సభను తప్పుదోవ పట్టించడం, సభ్యులను నమ్మించే ప్రయత్నమేని లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు నోటీసులో ప్రస్తావించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ నామా.. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపుతో ఉందని.. సభలో అమిత్ షా అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్వన్గా ఉందన్నారు. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని.. కనీసం ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి డబ్బులు వెళ్లుతున్నాయి కానీ.. అక్కడి నుంచి తిరిగి వచ్చిందేమీ లేదని ఆరోపించారు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు.