EPAPER
Kirrak Couples Episode 1

World Tribal Day : పాలకులారా .. ఎన్నాళ్లీ డోలీ మోతలు..

World Tribal Day : పాలకులారా .. ఎన్నాళ్లీ డోలీ మోతలు..
world tribal day 2023


World Tribal Day : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా గిరిజనులు 4 కిలోమీటర్ల డోలి యాత్ర చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ 5 గ్రామాలకు చెందిన ఆదివాసీలు యాత్ర నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ నీలబండ వద్ద ప్రారంభమైన డోలి యాత్ర.. పిత్రిగెడ్డ, పెదగరువు గ్రామాల మీదుగా జాజులబండ వద్ద ముగిసింది.

ఆర్ల నుంచి పెద్దగరువు, పిత్రుగెడ్డ, జాజులబంద వంటి కొండ శిఖర గ్రామాలకు తక్షణమే రోడ్లు వేయాలని డిమాండ్‌ చేశారు. ఆయా ప్రాంతాల్లో ST కోందు తెగకు చెందిన సుమారు 300 మంది ఆదివాసీ గిరిజనులు కొండపైనే జీవనం సాగిస్తున్నారు. 2020లో ఒక్కో ఇంటికి 10వేల చొప్పున చందాలు పోగు చేసుకుని 7 లక్షల సొంత ఖర్చుతో ఆదివాసీలే రోడ్డు నిర్మించుకున్నారు. అయితే వర్షాకాలం నేపథ్యంలో ఆ రోడ్డు కాస్త కొట్టుకుపోయింది. జ్వరాల బారిన పడితే కిలోమీటర్ల మేర రోగుల్ని డోలీల్లో మోసుకుంటూ ఆస్పత్రులకు తీసుకు వెళ్లాల్సి వస్తోంది.


ఇటీవల కుంబర్ల గ్రామానికి చెందిన రోజా అనే మహిళ.. అత్యవసర వేళ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఇదే విధంగా ఎంతో మంది సరైన సదుపాయాలు లేక మన్యం ఒడిలోనే కన్నుమూస్తున్నారు. కడుపులో ఉండే శిశువు నుంచి పండు ముదుసలి వరకు అందరూ కావాల్సిన సౌకర్యాలు లేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. దీంతో భారీ సంఖ్యలో గిరిజనులు ‘పాలకులరా ..ఎన్నాళ్లీ డోలీ మోతలు’ అంటూ నినాదాలతో డోలీయాత్ర నిర్వహించారు.

Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×