హైటెన్షన్ క్రియేట్ చేసిన విద్యుత్ ఉద్యోగుల సమ్మె నోటీసులు.. హ్యాపీ ఎండింగ్ అయ్యాయి. ఉద్యోగులతో మంత్రుల చర్చలు సఫలమయ్యాయి. సమ్మె నోటీసు ఉపసంహరించుకున్నటు విద్యుత్ జేఏసీ ప్రకటించింది.
విద్యుత్ జేఏసీ 15 శాతం ఫిట్మెంట్ డిమాండ్ చేయగా.. ప్రభుత్వం 9 శాతం ఇస్తామంది. చర్చల తర్వాత 9శాతం ఫిట్మెంట్కు జేఏసీ అంగీకరించింది. పీఆర్సీపై కూడా ఇరువర్గాల మధ్య అంగీకారం కుదిరింది. ఒప్పందంపై విద్యుత్ బోర్డ్ యాజమాన్యంతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశారు.
మాస్టర్ స్కేల్ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు మంత్రుల సబ్కమిటీ ఆమోదం తెలిపింది. పే స్కేల్ నిర్ధారించడానికి డిస్కంల సీఎండీలతో ఓ కమిటీ వేస్తామని.. ఆ కమిటీకి ఏపీజెన్కో సీఎండీ నేతృత్వం వహిస్తారని మంత్రులు ప్రకటించారు.