Hyderabad : హైదరాబాదీలకు నెట్ వర్క్ సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో జియో, ఎయిర్టెల్ నెట్వర్క్ లో సమస్యలు తలెత్తాయి. నెట్వర్క్ సరిగ్గా లేకపోవడంతో ఇంటర్నెట్ సర్వీస్ కూడా ఆగిపోయింది. యూజర్లు కాల్స్ చేసుకోలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో సిగ్నల్ ఉన్నా ఫోన్ కనెక్ట్ కావడంలేదు. హైదరాబాద్లో ప్రస్తుతం దాదాపు 80 శాతం మంది మొబైల్ యూజర్ల పరిస్థితి ఇలానే ఉంది. ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా కాల్స్ పోవడంలేదు.. రావడంలేదు. పెరిగిన యూజర్లకు తగ్గట్టుగా కంపెనీలు తమ సర్వీసులను విస్తరింకపోవడంతో సిటిజన్స్ ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.
మొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ప్రముఖ నెట్వర్క్ కూడా తన యూజర్లకు నాణ్యమైన సర్వీసులు ఇవ్వడం లేదు. నంబర్ టైప్ చేసి కాల్ చేస్తే ఎంత సేపయినా చడీ చప్పుడుండదు. ఎన్నిసార్లు కట్ చేసి తిరిగి ప్రయత్నించినా.. అదే పరిస్థితి. కనీసం పదిసార్లు ట్రే స్తే.. కలిసిందంటే హమ్మయ్య.. అదృష్టం అనుకుంటున్నారు యూజర్లు. కొందరికి సిగ్నల్ ఫుల్ ఉన్నా.. కాల్ కనెక్ట్ అయ్యిందంటే ఏంటీ..ఇంతసేపు నీ నంబర్ అందుబాటులో లేదని వచ్చింది అని అంటున్నారు ఫోన్ చేసిన అవతలి వ్యక్తులు. నెట్వర్క్ సమస్యలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.