టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన బిల్లులో 5 అంశాలపై గవర్నర్ తమిళిసై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ఈ బిల్లులో ఆర్టీసీకి కేంద్రం ఇచ్చిన లోన్లు, గ్రాంట్లు, అలాగే కేంద్ర వాటా వివరాలు లేవని తెలిపారు.
ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని గవర్నర్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? అని అడిగారు. విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవన్నారు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్లో న్యాయం ఎలా చేస్తారు? అని వివరణ కోరారు. అలాగే ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలు, ఉద్యోగ భద్రత స్పష్టమైన హామీ ఇవ్వాలని తమిళిసై కోరారు.
మరోవైపు గవర్నర్ తమిళిసై లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం కసరత్తు చేసింది. ఆర్టీసీ బిల్లులోని అభ్యంతరాలపై రాజ్భవన్కు వివరణ పంపింది.