Chandrababu: చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయి విమర్శలు చేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి. చంద్రబాబు మళ్లీ సీఎం అయితే.. తాను గుండు కొట్టించుకుంటానని శపథం చేశారు. తన ఆస్తి 2 వేల కోట్లు అని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు.. 20 కోట్లు ఇచ్చి.. తన ఆస్తినంతా తీసుకోవాలని సవాల్ చేశారు. ఆ మేరకు ఖాళీ బాండ్పేపర్పై సంతకం చేసి మీడియాకు ఇచ్చారు.
సీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీసిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుందన్నారు ఎమ్మెల్యే తోపుదుర్తి. చంద్రబాబు వేసిన శిలాఫలకాలు ఇంకా అలాగే ఉన్నాయని.. రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేసి తీరతామని చెప్పారు.