హర్యాణాలో బుల్డోజర్ యాక్షన్ మొదలైంది. ఇటీవల జరిగిన హింసాకాండకు కారణమైన వారిని గుర్తించి వారిపై బుల్డోజర్ యాక్షన్ తీసుకుంటామని రెండు రోజుల క్రితం ప్రకటించిన ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. నూహ్కు సమీపంలోని తౌరులో నివాసముంటున్న వలసదారులపై ఉక్కుపాదం. వారికి చెందిన 250 గుడిసెలను తొలగించారు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి అస్సాం మీదుగా వలస వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. వీరే నూహ్లో మొదట VHP ర్యాలీపైనా రాళ్ల దాడి చేసినట్టు గుర్తించారు.
భారీ భద్రత మధ్య ఈ అక్రమ నిర్మాణాల తొలగింపు కొనసాగింది. డుల వెనుక వీరి హస్తం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో సీఎం ఖట్టర్ ఈ తొలగింపులు చేపట్టాలని ఆదేశించారని తెలుస్తోంది. డు మసీదులపై జరిగిన దాడుల్లో కూడా వీరి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలపై నిషేధం విధించారు పోలీసులు. ముస్లిం మతపెద్దలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ముస్లిం సోదరులంతా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని కూడా పిలుపునిచ్చారు. ఇక అల్లర్లపై దాఖలైన FIRలపై విచారణ వేగంగా కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 176 మందిని అదుపులోకి తీసుకున్నారు. SMS సర్వీసులు, ఇంటర్నెట్ పై నిషేధం కొనసాగుతోంది.