హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తోంది. భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నగరం శివారు ప్రాంతాల్లో ధరలు ఆకాశ్నానంటుతున్నాయి. తాజాగా కోకాపేట భూములు ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. ఎకరం రూ. 100 కోట్లకు అమ్ముడు పోయింది. నగరంలో చట్టపక్కల ప్రాంతాల్లోని భూములు భారీ ధరలు పలుకుతున్నాయి.
తెలంగాణ సర్కార్ ఒక్కో ప్రాంతంలోని ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతోంది. భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. కోకాపేట భూముల వేలంగా సర్కార్ కు భారీ ఆదాయం వచ్చింది. తాజాగా మరో ప్రాంతంలో భూములను అమ్మకానికి పెట్టింది. బుద్వేల్ భూముల అమ్మకానికి సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో బుద్వేల్ ఉంది. ఇక్కడ బహుళ ప్రయోజన నిర్మాణాలకు అనుగుణంగా స్థలాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. మౌలిక వసతులు కల్పించింది. అన్ని సౌకర్యాల సమకూర్చి అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండీఏ ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.
బుద్వేల్లో మొత్తం 14 ప్లాట్లను అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. విస్తీర్ణం 3.47 ఎకరాలు నుంచి 14.33 ఎకరాల మధ్య ప్లాట్లను ఏర్పాటు చేశారు. ఎకరా కనీస ధరను రూ.20 కోట్లగా నిర్ణయించారు. ఆగస్టు 6న ప్రీబిడ్ సమావేశం నిర్వహిస్తారు. ఆగస్టు 8న సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. ఈ నెల 10న ఈ -వేలం నిర్వహిస్తారు. బుద్వేల్ లో ఎకరా సగటున రూ. 30 కోట్లకు అమ్ముడుపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ భూమల వేలందా ద్వారా కనీసం రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.