EPAPER
Kirrak Couples Episode 1

AP Highcourt : జగన్ సర్కార్ కు షాక్.. R-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే..

AP Highcourt : జగన్ సర్కార్ కు షాక్.. R-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే..

AP Highcourt : అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టే ఇచ్చింది. రాజధానేతర ప్రాంత ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేసింది. ఈ మేరకు జీవోలు ఇచ్చింది. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసింది. ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి ఇటీవల సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు.


ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ అమరావతి ప్రాంత రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐక్య కార్యాచరణ సమితి హైకోర్టులో పిటిషన్లు వేశాయి. ఈ పిటిషన్లపై జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని తీర్పు నిచ్చింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు విధించిన స్టేను తొలగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.


Related News

BjP vs DMK: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్.. భగ్గుమన్న దగ్గుబాటి పురంధేశ్వరి

Tirumala Laddu: లడ్డూ వివాదంతో శ్రీవారి ప్రతిష్ట మసకబారిందా? భక్తుల మనస్సులో లక్ష ప్రశ్నలు

Investments In AP: ఇంటర్నేషనల్ కంపెనీ ఏపీకి రాక.. వైజాగ్ లో లుల్లు మాల్.. యువతకు ఉపాధి మెండు

AP Politics: ముప్పేట దాడి.. వైయస్ జగన్ తట్టుకొనేనా.. వైసీపీకి గడ్డు కాలమేనా..

Pawan Kalyan : దేవాలయాలకు అసలైన అర్థం ఇదే.. ఇస్రో మాజీ చీఫ్ వీడియోపై పవన్ ట్వీట్

Tirumala Laddu: టెర్రరిస్ట్ లు కూడా ఈ పని చేయరు.. లడ్డు వివాదంపై అగ్ర హీరో సంచలన కామెంట్స్

Naga Babu : పెద్దల సభకు మెగా బ్రదర్ నాగబాబు ? అదే జరిగితే చిరు తర్వాత నాగబాబే !

Big Stories

×