TDP: పులివెందులలో పొలిటికల్ ఫైటింగ్ హైటెన్షన్కు దారి తీసింది. పూల అంగళ్ల సెంటర్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తుండగా.. అటువైపు వైసీపీ నాయకులు ఎదురు పడ్డారు. వాళ్ల కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కడప జిల్లాలో చంద్రబాబు ప్రాజెక్టుల పర్యటన వేడి రాజేసింది. జమ్మలమడుగు నుంచి సీబీఆర్-2 ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన చంద్రబాబు.. పులివెందుల రోడ్ షోలో ప్రసంగించాల్సి ఉంది. బాబు వస్తారని.. పులివెందుల టౌన్కు టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు. మరోవైపు.. పూల అంగళ్ల సెంటర్కు కొందరు వైసీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకుని వచ్చారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.
పూల అంగళ్ల సెంటర్ దగ్గర ఇలాంటిదేదో జరుగుతుందని పోలీసులు ముందే ఊహించారు. అక్కడ చంద్రబాబు ప్రోగ్రామ్ కుదరదని ఉదయం పర్మిషన్ ఇవ్వలేదు. మరో చోటుకి మార్చుకోవాలని టీడీపీ నేతలకు సూచించారు. పోలీస్ అనుమతిపై ఉత్కంఠ కొనసాగుతుండగానే.. అనుకున్నట్టుగానే అదే పూలఅంగళ్ల సెంటర్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఎదురుపడి కొట్టుకున్నారు.