Narendra modi news telugu(Parliament monsoon session live updates) : జాతుల ఘర్షణతో మణిపూర్ రగిలిపోతోంది. ప్రధాని మోదీ స్పందించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఎలాగైనా మోడీతో మాట్లాడించాలని.. పార్లమెంట్లో ఏకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానాన్ని స్వీకరించిన స్పీకర్.. తాజాగా చర్చకు తేదీలు ఖరారు చేశారు.
ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 8న అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్లో చర్చ ప్రారంభమవుతుంది. 9వ తేడీన కూడా చర్చ కంటిన్యూ అవుతుంది. ఆగస్టు 10న ప్రధాని మోదీ మాట్లాడుతారు. మొత్తం మూడు రోజుల పాటు చర్చ ఉంటుంది. ఈ మేరకు లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
నో కాన్ఫిడెన్స్ మోషన్పై పీఎం మోదీ ఏం మాట్లాడుతారనే ఆసక్తి పెరిగింది. సూటిగా, ధీటుగా, ఘాటుగా మాట్లాడే మోదీ.. ఈసారి విపక్షాలకు ఏ రేంజ్లో కౌంటర్ ఇస్తారో. గతంలో ‘ఏక్ మోదీ’ అంటూ ఛాతిపై చరుచుకుంటూ సభలో ఆయన చేసిన స్పీచ్.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అయింది. ఇప్పటికీ అనేకమంది ఆ వీడియో క్లిప్ను స్టేటస్లుగా పెట్టుకుంటుంటారు. ఏ టాపిక్లోనైనా అనర్గళంగా మాట్లాడే సత్తా.. ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేసే వాక్చాతుర్యం ఉన్న మోదీ.. మణిపూర్ పరిణామాలపై ఏం చెబుతారోననే ఇంట్రెస్ట్ కనిపిస్తోంది.