EPAPER
Kirrak Couples Episode 1

ED raids on Rayapati: రాయపాటి కంపెనీ మనీలాండరింగ్.. ఈడీ అటాక్..

ED raids on Rayapati: రాయపాటి కంపెనీ మనీలాండరింగ్.. ఈడీ అటాక్..
Rayapati sambasiva rao news

Rayapati Sambasiva rao news(Breaking news in Andhra Pradesh) : టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు లక్ష్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ దాడులు చేపట్టింది. హైదరాబాద్ తో పాటు గుంటూరులోని ఆయనతో పాటు సంబంధిత కంపెనీ డైరెక్టర్ల.. ఇళ్లు, కార్యాలయాలపై మంగళవారం ఉదయం నుంచే ప్రత్యేక బృందాలు సోదాలు జరుపుతున్నాయి.


ట్రాన్స్‌స్టాయ్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. బ్యాంకు రుణాల ఎగవేత అంశంపై గతంలో మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. కేసు విచారణలో భాగంగానే రాయపాటి నివాసంలో తనిఖీలు చేపట్టారు అధికారులు. హైదరాబాద్, గుంటూరు సహా తొమ్మిది చోట్ల సోదాలు నిర్వహించామని.. రాయపాటి, ఇతర ప్రమోటర్ల కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరిగాయని ఈడీ అధికారులు ప్రకటించారు.

టీడీపీ హయాంలో మొదట పోలవరం ప్రాజెక్ట్ పనులు చేసింది రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీయే. ఆ తర్వాత కాంట్రాక్టర్‌ను మార్చేశారు. ప్రస్తుతం రాయపాటి సాంబశివరావు టీడీపీలోనే కొనసాగుతున్నారు.


మరోవైపు హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో ఈడీ దాడులు జరుపుతోంది. మాలినేని సాంబశివరావుతో పాటు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.

Related News

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

YS Jagan: ఒంటరైన జగన్.. అన్ని డోర్లు క్లోజ్

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ

Tirumala Laddu Issue: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

Pawan Kalyan Prayaschitta Deeksha: ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్.. టీటీడీ బోర్డు ఏం చేసింది ?

Big Stories

×