Telangana News : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. చెరుకు సుధాకర్, శ్రావణ్ కుమార్ పిల్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షాన్ని కురిపించింది.
ప్రభుత్వం వరద బాధితులకు ఎలాంటి ఆసరా కల్పిస్తుందని ప్రశ్నించింది హైకోర్టు. ఎన్నికల కోసం వార్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు కానీ.. వరదల కోసం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించింది. వరదల్లో చిక్కుకున్న వారికి తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.
డిజాస్టర్ చట్టం ప్రకారం ఎంతమందిని రక్షించారో చెప్పాలని సర్కారును నిలదీసింది ఉన్నత న్యాయస్థానం. వరద చర్యల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటో పూర్తి నివేదికను సోమవారం సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.