Singareni news today telugu(Telangana news): దంచికొడుతున్న వర్షాలు సింగరేణిపై ప్రభావం చూపుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సింగరేణి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మంచిర్యాల జిల్లా వ్యాపంగా వర్షాలు పడుతుండంతో నీరు ఓపెన్ కాస్ట్ గనులలోకి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి కి ఆటంకం కలిగింది. శ్రీరామ్పూర్, ఇందారం, మందమర్రి, అర్కెపి, కైరిగూడ OCPలలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
వర్షాలతో సింగరేణి ఉపరితల గనుల్లో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. సాధారణంగా ఉపరితల గనుల్లో నిర్దేశిత లక్ష్యాన్ని మించి బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. వర్షాల వల్ల ఓపెన్ కాస్ట్ గనుల్లో నీరు చేరింది. మరోవైపు, క్వారీలోకి వెళ్లే రోడ్లన్ని బురదమయంగా మారాయి. భారీ వాహనాలు ఇప్పుడా రోడ్లలో ప్రయాణించలేని పరిస్థితి ఉంది. ఇప్పుడీ గనుల్లో నిలిచిన నీటిని తొలగించడం సింగరేణికి బిగ్ టాస్కే అంటున్నారు.