NTR : జూనియర్ ఎన్టీఆర్ కర్నాటకలో సందడి చేయనున్నాడు. యంగ్ టైగర్ నవంబర్ 1న బెంగళూరు చేరుకుంటాడు. విధాన సౌధాలో జరిగే కార్యక్రమానికి హాజరవుతాడు. నవంబర్ 1న జరిగే కన్నడ రాజ్యోత్సవ వేడుకలో అతిథిగా తారక్ పాల్గొంటాడు. ఆ రోజు కర్నాటక ప్రభుత్వం కన్నడ రత్న పురస్కారాన్ని దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు ప్రదానం చేయనుంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించారు. పునీత్ రాజ్ కుమార్ శాండల్ వుడ్ లో స్టార్ గా వెలుగొందారు. యూత్ లో విపరీతమైన పాపులారిటీ సంపాదించారు. అయితే 46 ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో మరణించారు. పునీత్ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా కర్నాటక ప్రభుత్వం కన్నడ రత్న అవార్డును ప్రకటించింది. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు బెంగళూరులో ఏర్పాట్లు చేస్తున్నారు.