EPAPER
Kirrak Couples Episode 1

AP News : వానల వేళ కరెంట్‌తో జాగ్రత్త.. ముగ్గురు మృత్యువాత..

AP News : వానల వేళ కరెంట్‌తో జాగ్రత్త.. ముగ్గురు మృత్యువాత..
AP Electric Shock News


AP Electric Shock News(Local news andhra Pradesh) : వేర్వేరు చోట్ల జరిగిన విద్యుత్ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో ఓ ఇంట్లో కరెంటు రిపేర్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు.

జమ్మలమడుగు మండలం పెద్ద దండ్లూరులో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని శివశంకర్ కి చెప్పగా పరిశీలించేందుకు వెళ్లాడు. ఇదే సమయంలో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. శివశంకర్ అక్కడికక్కడే చనిపోగా.. శ్రీకాంత్ రెడ్డి జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు కోల్పోయాడు.


కాకినాడ రూరల్ రాయుడుపాలెం జంక్షన్‌లోనూ విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు మరణించాడు. భవనంపై కూలి పనులు చేస్తుండగా అకస్మాత్తుగా ఈ ఘటన జరిగింది. మృతుడు సామర్లకోట మండలం హుస్సేన్ పురం వాసిగా గుర్తించారు.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో కరెంట్‌ షాక్‌తో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘతానికి గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్దారించారు.

Related News

Waiting For Help: సీఎం గారూ.. నా కొడుకును బ్రతికించండి, ఓ తల్లి కన్నీటి వ్యథ

Cm Chandrababu : శభాష్… చాలా మంచి పని చేశారు, ప్రజలను మెచ్చుకున్న సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్‌కు అస్వస్థత, ఆ సమస్య తిరగబడిందా?

Kadambari jethwani case : ముంబయి నటి కాదంబరి కేసులో కీలక పరిణామం… నేడో రేపో సీఐడీ చేతికి ?

AP Govt: దసరాకు సూపర్ కానుక ప్రకటించిన ప్రభుత్వం.. మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు

Home Minister: కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా?.. అయితే ఈ శుభవార్త తెలుసా..?

Pawan Klayan: వైసీపీకి ఝలక్ ఇచ్చిన పవన్.. విచారణ ఎదుర్కోవాల్సిందే.. రెడీగా ఉండండి అంటూ ప్రకటన

Big Stories

×