Kazipet railway station news(Latest news in telangana): ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరమంతా నిండా మునిగింది. కాజీపేట్ రైల్వే స్టేషన్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. పట్టాలు నీట మునిగాయి. ప్లాట్ఫామ్ లెవల్ వరకు వరద ముంచెత్తింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రైల్వే ట్రాక్, ప్లాట్ఫామ్తో పాటు రైల్వే స్టేషన్ ఆవరణ మొత్తం వరద నీరు పారింది. టికెట్ బుకింగ్ కౌంటర్, ఎంక్వయిరీ సెక్షన్, ప్యాసింజర్స్ వెయింట్ హాల్లోని నీళ్లు వచ్చాయి. కాజీపేట్ రైల్వే స్టేషన్ చెరువును తలపించింది. వరదతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.