Pilli subhash chandra bose news(YSRCP latest updates) : వైసీపీకి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఆయన జనసేనలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. పిల్లి కుమారుడు సూర్యప్రకాష్ కు జనసేన టికెట్ కన్ఫామ్ అయిందని అంటున్నారు. త్వరలోనే తన రాజ్యసభ సభ్యత్వానికి పిల్లి బోస్ రాజీనామా చేస్తారని సమాచారం. ఇటీవల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, పిల్లి సుభాష్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
సీఎం జగన్ వద్దకు రామచంద్రపురం పంచాయితీకి వెళ్లింది. ఇప్పటికే బోస్ .. సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తన వాయిస్ ను వినిపించారు. జగన్ నుంచి సరైన హామీ లభించకపోవడంతో తన రాజకీయ భవిష్యత్ పై బహిరంగంగా ప్రకటన చేశారు. రామచంద్రపురం టిక్కెట్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఇస్తే తాను అక్కడ నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. దీనికి మంత్రి వేణు కూడా కౌంటర్ వేశారు. తాను రామచంద్రపురం నుంచే పోటీకి దిగుతానని ప్రకటించారు.
రామచంద్రపురంలో బోస్, వేణు పంచాయితీ నేపథ్యంలో వైసీపీ నేత తోట త్రిమూర్తులుకు వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. తాజా పరిణామాలపై ఆయన నుంచి సమాచారం సేకరించింది. ఈ క్రమంలో బోస్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేస్తారని సమాచారం. ఆయన కుమారుడిని జనసేన తరఫున రామచంద్రపురం బరిలోకి దింపాలని యోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే టిక్కెట్ విషయంలో జనసేన నుంచి స్పష్టమైన హామీ వచ్చిందని అంటున్నారు.