Rahul Fires on KCR : పాలమూరు జిల్లాలోని మన్యంకొండలో నిర్వహించిన బహిరంగ సభలో టీఆర్ఎస్ , బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు రాహుల్ గాంధీ. తెలంగాణలో మూడోరోజు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు పలుకుతోందనన్నారు. అన్నదమ్ముల మధ్య గొడవులు పెడుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ లో బీజేపీకి టీఆర్ఎస్ అనేక సందర్భాల్లో మద్దతుగా నిలిచిందన్నారు రాహుల్. తెలంగాణలో రాజు పాలన నడుస్తోందన్నారు. ప్రతిరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ చూస్తారని తెలిపారు. ఎవరు ఎక్కడ భూములు కొన్నారో పరిశీలిస్తారని వివరించారు. ఎవరి భూములు లాక్కోవాలని చూస్తారని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అటవీ హక్కుల చట్టం పక్కాగా అమలు చేస్తామన్నారు . దళితులకు ఇచ్చిన భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. GSTతో నష్టపోతున్నామని చేనేత కార్మికులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే GSTలో మార్పులు తీసుకొస్తామన్నారు.