Ajanta Caves : సెల్ఫీ మాయలో పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫోటోలకు పోజులివ్వడానికి కొంతమంది స్టంట్లు చేస్తున్నారు. మహారాష్ట్రలోని అజంతా గుహల్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
సెల్ఫీ కోసం ఫోజులిస్తూ ఓ యువకుడు జలపాతంలో జారిపడ్డాడు. సోయగావ్కు చెందిన గోపాల్ తన ఫ్రెండ్స్తో కలిసి అజంతా గుహలకు వెళ్లాడు. జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకుంటుండగా బ్యాలెన్స్ తప్పి 2 వేల అడుగుల లోతైన గోతిలో పడిపోయాడు. వెంటనే అతని స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు.
అయితే, జారిపడిన యువకుడికి అదృష్టం బాగుంది. అతనికి ఈత రావడం బతికి బట్టకట్టాడు. జలపాతంలో కొట్టుకుపోకుండా ఓ రాయిని పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. పోలీసులు, అధికారులు కష్టపడి అతడిని కాపాడారు. అందుకే, సెల్ఫీల పేరుతో ఓవరాక్షన్ వద్దు. వాటర్ ఫాల్స్ దగ్గర మరింత జాగ్రత.