Congress: తెలంగాణ కాంగ్రెస్లో కొత్త లొల్లి మొదలైంది. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎన్నికల కమిటీలో కూడా తనకు చోటు దక్కలేదని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
బీసీ నేతగా పార్టీలో తనకు సరైన గౌవరం దక్కడం లేదనే నిరాశలో ఉన్నారు పొన్నం. ఓ మాజీ ఎంపీ, తెలంగాణ ఉద్యమకారుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
కమిటీలో తనకు అన్యాయం జరిగిందని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు దృష్టికి తీసుకెళ్లినా లాభం లేదని పొన్నం వాపోతున్నారు. పార్టీని నమ్ముకున్నందుకు తనకు అన్యాయం జరిగిందని.. ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పొన్నం ప్రభాకర్.