Ambati Rambabu latest news(AP updates): సత్తెనపల్లి వైసీపీలో మంట రేగుతోంది. మంత్రి అంబటి రాంబాబు వ్యవహారశైలి పార్టీలో కొంతమందికి తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. వైసీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు మంత్రి అంబటికి వ్యతిరేకంగా రహస్య సమావేశం నిర్వహించారు. వైసీపీ నేత చిట్టా విజయ భాస్కర్ రెడ్డి ఇంట్లో మంతనాలు జరిపారు.
అంబటి రాంబాబు తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సర్పంచ్లు, ఎంపీటీసీలు రగిలిపోతున్నారు. కనీసం మంత్రి అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని ఆవేదన చెందుతుతన్నారు. రెండు రోజుల్లో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు.