Sriramana : ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ కన్నుమూశారు. 70 ఏళ్ల ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం వేకువజామున 5గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ దర్శకులు బాపు, రమణతో కలిసి శ్రీరమణ పనిచేశారు.
మిథునం సినిమా శ్రీరమణకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. తనికెళ్ల భరణి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఆయన కథ అందించారు. 2012లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది.
శ్రీరమణ గుంటూరు జిల్లా వేమూరు మండలం వరహాపురం అగ్రహారంలో 1952 సెప్టెంబర్ 21న జన్మించారు. ఆయన అసలు పేరు కామరాజ రామారావు. రచయితగా శ్రీరమణ తనదైన ముద్ర వేశారు. పేరడి రచనలు ఆయనకు ఎంతో పేరుతెచ్చాయి. ఆయన పలు తెలుగు దిన పత్రికల్లో పని చేశారు. నవ్య వార పత్రికకు ఎడిటర్గా శ్రీరమణ కొంతకాలం పనిచేశారు. కాలమిస్టుగా, కథకుడిగా, సాహిత్య, కళా రంగాలకు విశిష్ట సేవలందించారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.