Delhi Liquor Case latest news(Andhra news updates): దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చేటుచేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవ్కు బెయిల్ మంజూరు అయ్యింది. వైద్య కారణాలతో రాఘవ్కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
ఈడీ అధికారులు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని ఢిల్లీ హైకోర్టు మాగుంట రాఘవకు స్పష్టం చేసింది. విచారణకు పిలిచినప్పుడు చెన్నై లేదా ఢిల్లీ కార్యాలయాల్లో ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. నిందితుడు రాఘవ చెన్నైలో ఉండాలని న్యాయస్థానం నిర్దేశించింది.
రాఘవ.. ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 4గంటలకు ఈడీ ఎదుట రిపోర్టు చేయాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. అతని పాస్పోర్ట్ను సరెండర్ చేయాలని ఆదేశించింది.