EPAPER
Kirrak Couples Episode 1

Congress : టీకాంగ్రెస్ రైతు భరోసా యాత్ర.. షెడ్యూల్ రిలీజ్..

Congress : టీకాంగ్రెస్ రైతు భరోసా యాత్ర.. షెడ్యూల్ రిలీజ్..

Telangana congress news today(Latest political news telangana) : తెలంగాణలో కాంగ్రెస్ మరో కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. రైతు భరోసా యాత్ర చేపట్టేందుకు టీపీసీసీ కిసాన్‌ సెల్‌ కార్యచరణ రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో యాత్ర సాగుతుంది. ఈనెల 19 ఆదిలాబాద్‌లో రైతు భరోసా యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 2న నిజామాబాద్‌లో యాత్ర ముగుస్తుంది.


రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అజెండాగా రైతు భరోసా యాత్ర సాగనుంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయరంగ అభివృద్ధికి ఏం చేస్తామనే విషయంపై రైతులకు స్పష్టత ఇస్తామని టీపీసీసీ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు సుంకెట అన్వేశ్‌రెడ్డి తెలిపారు. టీపీసీసీ ఈ యాత్ర షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.

ఈనెల 19న సాయంత్రం ఆదిలాబాద్‌లో రైతు భరోసా యాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 20న ఆసిఫాబాద్, మంచిర్యాల, 21న జగిత్యాల, సిరిసిల్ల, 22న సిద్ధిపేట, జనగామ, 23న హనుమకొండ, వరంగల్, 24న పెద్దపల్లి, భూపాలపల్లి, 25న ములుగు, మహబూబాబాద్ లో యాత్ర సాగుతుంది.


ఈ 26న కొత్తగూడెం, ఖమ్మం, 27న సూర్యాపేట, యాదాద్రి, 28న రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్, 29న వనపర్తి, గద్వాల, 30న మహబూబ్‌నగర్, నారాయణపేట, 31న వికారాబాద్, సంగారెడ్డి, ఆగస్టు 1న మెదక్, కామారెడ్డిల మీదుగా ఆగస్టు 2 నాటికి నిజామాబాద్‌ జిల్లాకు రైతు భరోసా యాత్ర చేరుకుంటుంది. అక్కడే యాత్రను ముగిస్తారు. ఆ రోజు నిజామాబాద్‌లో భారీ సభ నిర్వహించే యోచనలో ఉన్నారు.

Related News

Bigg Boss: ప్రేయసితో ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్..!

Bigg Boss 8 Day 22 Promo: నామినేషన్ రచ్చ షురూ.. మళ్ళీ అదే పెంట..!

Megastar: నెల రోజులుగా ఆ వ్యాధితో బాధపడుతున్న చిరు.. దగ్గరుండి ఆ పని చేసిన సాయి తేజ్..!

Chiranjeevi : గిన్నిస్ రికార్డులో మెగాస్టార్ కి చోటు.. అమీర్ ఖాన్ చేతుల మీదుగా..!

Bigg Boss 8 Day 21 Promo: గెస్ ది సౌండ్ .. కొత్త టాస్క్ తో తికమక పెట్టించిన బిగ్ బాస్..!

Jani Master: నువ్వు మామూలోడివి కాదయ్యో.. ఇంతమందిపై లైం*గి*క దాడా..?

Bigg Boss 8 Day 21 Promo: సెట్ ఆర్ కట్.. రియల్ ఫన్ డే అయ్యిందిగా..?

Big Stories

×