RGV Vyuham : ఏపీ రాజకీయ నేపథ్యంలో.. సంచలన దర్శకుడు రాంగోపాల్వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం వ్యూహం. ఇప్పటికే టీజర్ విడుదలతో సంచలనం రేకెత్తించిన ఆర్జీవీ.. ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్తో జనాల్లో మరింత ఆసక్తి పెంచుతున్నారు.
కుట్రలకి, ఆలోచనలకి మధ్యలో అసమాన్యుడుగా ఎదిగిన నాయకుని కథే వ్యూహమని.. ఆ నాయకుడే YS జగన్ అంటూ ఫోటోలు వదిలారు ఆర్జీవీ.
వ్యూహం సినిమాను దాసరి కిరణ్కుమార్ నిర్మిస్తుండగా… జగన్ పాత్రలో అజ్మల్ నటిస్తున్నారు. భారతీ పాత్రలో మానస కనిపించనున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రానికి సంబంధించిన విశేషాలను వరుసగా విడుదల చేస్తామని యూనిట్ వెల్లడించింది. మిగిలిన భాగాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి.. విడుదల చేయనున్నట్లు తెలిపింది.