Breaking News : అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. రామచంద్రాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ శివాజీ ఆత్మహత్యాయత్నం చేశారు. తనపై జరిగిన దాడిని తట్టుకోలేక.. శివాజీ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఆయన్ని హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆదివారం రామచంద్రాపురంలోని 17వ వార్డులో నిర్వహించిన సురక్ష కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ శివాజీని వైసీపీ కార్యకర్త చొక్కా పట్టుకుని నిలదీశారు. మంత్రి వేణు సమక్షంలోనే ఈ దాడి జరిగింది. దాడి చేసింది.. మంత్రి వేణు వర్గానికి చెందిన వ్యక్తే అని.. పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గం ఆరోపిస్తోంది. అంతమంది సమక్షంలో దాడి జరగడాన్ని అవమానంగా భావించిన శివాజీ.. పురుగుల మందుతాగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు.