TDP : తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ టీడీపీ మహిళా అధ్యక్షరాలు వంగలపూడి అనిత నందిగామలో ఆందోళనకు దిగారు. వైసీపీ ఎమ్మెల్సీ అనుచరుడిగా ఉన్న సజ్జన్ రావు అనే వ్యక్తి.. సోషల్ మీడియా వేదికగా
ఇలాంటి పోస్టులు పెడుతున్నాడని ఆమె మండిపడింది.
సజ్జన్రావు ఇంటి ముందు.. తంగిరాల సౌమ్యతో పాటు తెలుగు మహిళలతో కలిసి ఆందోళనకు దిగారు అనిత. విలేకరి ముసుగులో సజ్జన్ రావు మహిళలపై బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనపై పెట్టిన పోస్టులను డిలీట్ చేసి.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వంగలపూడి అనిత.