Srikalahasti news telugu(Latest news in Andhra Pradesh): శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్పై రాష్ట్ర మానవహక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేసు నమోదు చేశారు HRC జ్యూడిషియల్ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం. సీఐ అంజు యాదవ్కు నోటీసులు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జనసేన నాయకులపై శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ చేయిచేసుకున్న విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సీఎం జగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన నాయకులపై.. సీఐ అంజు యాదవ్ దురుసుగా ప్రవర్తించారు. ఓ నాయకుడి రెండు చెంపలపై కొట్టారు. ఆ వీడియో వైరల్ కావడంతో.. ఏపీలో కలకలం చెలరేగింది. సీఐ తీరుపై జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఈ అంశంపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన కార్యకర్తను కొడితే తనను కొట్టినట్టే అన్నారు. శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తను సీఐ కొట్టారని.. ఎందుకు కొట్టారో అక్కడికి వెళ్లే తేల్చుకుంటానని సవాల్ కూడా చేశారు.