Sri Chaitanya Chairman B.S. Rao News(Telugu news updates): శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బొప్పన సత్యనారాయణరావు (బీఎస్రావు) కన్నుమూశారు. శుక్రవారం విజయవాడలో అంత్యక్రియలు జరగనున్నాయి.
1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు బీఎస్ రావు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అనేక స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు స్థాపించారు. గడిచిన 30 ఏళ్లలో లక్షలాది మంది విద్యార్థులకు విద్యను అందించారు. నారాయణ విద్యాసంస్థలతో పోటాపోటీగా ర్యాంకుల వేటలో నిలిచారు.
ఇటీవల బీఎస్రావు బాత్రూమ్లో కాలుజారి గాయపడినట్టు తెలుస్తోంది. చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు.