EPAPER
Kirrak Couples Episode 1

Falaknuma Express: అప్పుడు తోటి ప్రయాణికులను కాపాడి.. ఇప్పుడు ప్రాణాపాయస్థితిలో ఆ యువకుడు..

Falaknuma Express: అప్పుడు తోటి ప్రయాణికులను కాపాడి.. ఇప్పుడు ప్రాణాపాయస్థితిలో ఆ యువకుడు..

Falaknuma express train fire accident news(Local news telangana) : ఫలక్‌నుమా రైలు అగ్ని ప్రమాదాన్ని తొలుత పసిగట్టి చైన్‌ లాగి వందల మంది ప్రాణాలు కాపాడిన రాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని లక్ష్మీనగర్‌లోని తన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో స్పృహతప్పి పడిపోయారు. తల్లి పార్వతి పలుమార్లు ఫోన్‌ చేసినా తీయలేదు. అనుమానంతో ఆమె ఇంటికి వచ్చి చూడగా కిందపడిపోయి కనిపించాడు. వెంటనే సూరారంలో మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఛాతి నొప్పితోపాటు తలనొప్పి ఉందని ఆయన తల్లి పేర్కొన్నారు.


శ్రీకాకుళం జిల్లా పాత పట్టణం సమీపంలోని చిన్న మల్లెపురానికి చెందిన రాజు ఐడీఏ బొల్లారంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తూ పదేళ్లుగా కుటుంబంతో ఇక్కడే నివసిస్తున్నాడు. ఇటీవల ఒడిశాలోని అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పలాసలో ఫలక్‌నుమా రైలెక్కాడు. భువనగిరి సమీపంలో రైలులో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాన్ని పసిగట్టి చైన్‌లాగి 60 మంది ప్రయాణికులు సురక్షితంగా కిందకు దిగడానికి కారణమయ్యారు.

తోటి ప్రయాణికులను రక్షిస్తున్నప్పుడు మంటలద్వారా వచ్చిన పొగను సుమారు 45 నిమిషాలు పీల్చాడు. తరువాత ఆయన స్పృహతప్పి పడిపోగా రైల్వే సిబ్బంది భువనగిరి ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అదేరోజు ఇంటికి చేరుకున్నాడు. తమ కుమారుడి అనారోగ్య సమస్యను గుర్తించి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని ఆయన తల్లి కోరారు.


Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×