AP Cabinet : నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాకులో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. ఆగస్టులో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు, మారుతున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేబినెట్ భేటీలో మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఖరీఫ్ సీజన్ లో చేపట్టాల్సిన చర్యలు.. పెరుగుతున్న ధరలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. వాటితోపాటుగా అర్చకులకు గౌరవ వేతనం పెంపు, దేవాదాలయాల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపునకు మంత్రి మండలి ఆమోదం తెలపుతుందని తెలుస్తోంది. సీఎం ఢిల్లీ టూర్ పై కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉందని సమాచారం.