EPAPER
Kirrak Couples Episode 1

Road Accident : సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఏడుగురు మృతి..

Road Accident : సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఏడుగురు మృతి..

Road Accident : ప్రకాశం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. దర్శి సమీపంలో సాగర్‌ కాల్వలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. 18 మందికి గాయాలయ్యాయి. ఈ బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద జరిగిన సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు.


పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పొదిలికి చెందిన ఓ కుటుంబం వివాహ రిసెప్షన్‌ కోసం కాకినాడ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనలో అబ్దుల్‌ అజీజ్‌(65), ముల్లా జానీబేగం(65), అబ్దుల్‌ హాని(60), ముల్లా నూర్జహాన్‌ (58), షేక్‌ రమీజా (48),షేక్‌ షబీనా(35),షేక్‌ హీనా(6) ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు క్షతగాత్రులను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. మృతురాలు షేక్‌ రమీజా భర్త చెన్నైలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కాకినాడకు రైలులో వెళ్లారు. దీంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ప్రమాదస్థలిని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ పరిశీలించారు. దర్శిలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.


Related News

CM Chandrababu: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ పన్ను ఉండదు!

RK Roja: బావ కళ్లల్లో ఆనందం కోసం.. పురందేశ్వరిపై రోజా గరంగరం!

YS Sharmila: దీక్షలో వైఎస్ షర్మిల.. ప్లీజ్ రాజకీయాలొద్దు, టీడీపీ, వైసీపీ, జనసేనకు రిక్వెస్ట్..

Pawan’s daughter declaration: వైసీపీకి ఛాన్స్ ఇవ్వలేదు.. తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ డిక్లరేషన్

Fake FIR Incident: కర్నూల్‌లో జై భీం మూవీ సీన్ రిపీట్.. మరీ ఇంత దారుణమా..?

SIT probe temporarily stopped: తిరుమల లడ్డూ వివాదం, సిట్ దర్యాప్తు బ్రేక్ వెనుక.. అసలేం జరిగింది?

Waiting For Help: సీఎం గారూ.. నా కొడుకును బ్రతికించండి, ఓ తల్లి కన్నీటి వ్యథ

Big Stories

×