Pawan Kalyan varahi yatra second schedule (AP updates): రెండో విడత వారాహి యాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై జనసేనానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ జిల్లా నాయకుడు చలమలచెట్టి రమేష్ అన్ని ఏర్పాట్లు చేశారు.
జనసేన కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా 3 కిలోమీటర్లు నిలబడి తమ నాయకుడికి స్వాగతం పలికారు. కార్యకర్తలకు కారుపై నుంచి పవన్ కల్యాణ్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ ర్యాలీలో జనసేన కార్యకర్తల బైక్ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను 108 అంబులెన్స్లో సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.