Devineni Uma: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడైనా మరణించవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఉదహరించారు.
కొండపల్లిలో ఇటీవలే తన కారుపై బండరాయితో దాడి జరిగిందని చెప్పారు. ఆ సమయంలో కారు డోర్ తెరిచి ఉంటే.. తనతో పాటు మరికొందరు కూడా మరణించే వారని అన్నారు. అలాగే గోదావరిలో పడవ మునిగినప్పుడు కూడా అదే భయం వెంటాడిందని గుర్తు చేసుకున్నారు.
ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగినా.. చింతలపూడి ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీరు నాగార్జున సాగర్ కాలువల్లో పారించే వరకు ఊరుకోనని స్పష్టం చేశారు దేవినేని ఉమా.