Odisha train accident news today(Latest breaking news in telugu): ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. దర్యాప్తులో భాగంగా ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసింది.
సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరున్ కుమార్ మొహన్తా, సెక్షన్ ఇంజినీర్ మొహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పూ కుమార్ అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఆ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్స్ 304, 201 కింద కేసు నమోదు చేశారు.
గత నెల 2న బహనాగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 291 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. కుట్ర వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తేల్చారు.