Kidnap : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో జరిగిన బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఈడబ్ల్యూసీ కాలనీలో చిన్నారి కృష్ణవేణి బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటోంది. ఆ సమయంలో చిన్నారి కిడ్నాప్ నకు గురైంది. సీసీ ఫుటేజీ ఆధారంగా అదే కాలనీకి చెందిన సురేశ్ బాలికను అపహరించాడని పోలీసులు గుర్తించారు.
బాలిక ఆచూకీ కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిందితుడు సురేశ్ అనుమానాస్పందంగా తిరుగుతుండగా రైల్వే పోలీసులు విచారించారు. ఆ చిన్నారిని ఘట్కేసర్లో కిడ్నాప్ చేశానని నిందితుడు అంగీకరించాడు. దీంతో రైల్వే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి కృష్ణవేణి ఆచూకీ లభించిన నేపథ్యంలో ఘట్కేసర్ పోలీసులకు సమాచారం అందించారు.
ఘట్ కేసర్ పోలీసులు పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డ సురక్షితం రావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు వేగంగా స్పందిండంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది.