Triple Murder : రెండు ఎకరాల భూమి కోసం.. అక్క, తమ్ముడు, పిన్నిని అతి కిరాతకంగా ఖతం చేశాడు ఓ ఉన్మాది. పల్నాడు జిల్లా ధూళిపాళ్లలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్తి కోసమే నిందితుడు ఖాసిం.. అతని కొడుకుల సాయంతో బాబాయి కుటుంబాన్ని హత్య చేశాడని విచారణలో తేలింది.
మొదట తమ్ముడు రెహ్మాన్ను హత్య చేసి.. ఆ శవాన్ని తానే గోనె సంచిలో చుట్టి పాతి పెట్టినట్లు ఖాసిం ఒప్పుకున్నాడు. దీంతో సత్తెనపల్లి- పిడుగురాళ్ల రోడ్డులో కేఎస్పీ దాబా గార్డెన్ దగ్గర రెహ్మాన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రెహ్మాన్ను హత్య చేసిన తర్వాత.. ఇంటికి బాబాయి ఇంటికి వెళ్లిన ఖాసిం.. పిన్ని, అక్కపై కత్తులతో కిరాతకంగా దాడి చేశారు.
రహిమున్నీసా భర్త కొంతకాలం క్రితం చనిపోయారు. దీంతో కుమార్తె మౌలాబీతో కలిసి ఆమె ఉంటున్నారు. అయితే వారికి వారసత్వంగా రెండెకరాల భూమి వచ్చింది. ఈ భూమికి సంబంధించిన వ్యవహారంలో వారితో ఖాసీంకు తగాదాలు ఉన్నాయి. గతంలో పలు సార్లు ఈ విషయంపై గొడవలు జరిగినట్టు తెలుస్తోంది.