Bandi sanjay: బండి సంజయ్కు రాష్ట్ర అధ్యక్ష పదవి చేజారిందని.. అభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ నుంచి కిషన్రెడ్డికి అప్పగించింది అధిష్టానం. అధ్యక్ష బాధ్యతల నుంచి బండిని తప్పించడంతో.. మనస్థాపంతో ఖమ్మంకు చెందిన అభిమాని గజ్జల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు వైద్యులు.