World Cup Trophy : దేశవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తున్నారు. టీమిండియా కలిసి వరల్డ్ కప్ను మన దేశానికి తీసుకొచ్చి చాలా ఏళ్లు అయ్యింది. అందుకే ప్రతీ ఏడాదిలాగా ఈ సంవత్సరం కూడా టీమ్ పర్ఫార్మెన్స్ను మెరుగుపరిచి కప్ను ఇంటికి తీసుకొస్తారేమో అని అభిమానులు ఆశగా చూస్తున్నారు. ఇక వరల్డ్ కప్కు ఇంకా టైమ్ ఉండగా.. ప్రస్తుతం వరల్డ్ కప్ ట్రాఫీ ప్రపంచంలోని వివిధ దేశాలను, దేశంలోని పలు రాష్ట్రాలను చుట్టేస్తోంది.
తాజాగా ఓడీఐ వరల్డ్ కప్కు సంబంధించిన ట్రాఫీ ముంబాయ్లోని బొంబాయ్ స్కాటిష్ స్కూల్కు చేరుకుంది. ఈ ఏడాది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ‘ట్రాఫీ టూర్’ అనే కొత్త రకమైన ప్రమోషన్ను ప్రారంభించింది. ప్రపంచంలోని వివిధ రాష్ట్రాలకు ఈ ట్రాఫీ వెళ్లనుంది. వరల్డ్ కప్ టోర్నమెంట్స్ ఈసారి ఇండియాలో కూడా జరగనున్నాయి. అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు ఇండియాలోని 10 సిటీలలో వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి.
‘వరల్డ్ కప్ మా స్కూల్కు వచ్చింది. ఇది ట్రాఫీ టూర్లో భాగంగా జరిగింది. కోలకత్తా నుండి లే వరకు వెళ్లిన ట్రాఫీ.. ఇప్పుడు ముంబాయ్కు చేరుకుంది. ముంబాయ్లో ట్రాఫీని ప్రదర్శించగలిగే అవకాశం మా స్కూల్కు మాత్రమే దక్కింది.’ అని బొంబాయ్ స్కాటిష్ ప్రిన్సిపల్ సునీత జార్జి సంతోషం వ్యక్తం చేశారు. ఈ వరల్డ్ కఫ్ ట్రాఫీని చూడడానికి 20 స్కూల్ క్రికెట్ టీమ్స్ వస్తున్నాయని సునీత తెలిపారు. వరల్డ్ కప్ ట్రాఫీ అంటే క్రికెట్ ఫ్యాన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అది ఆలోచించే ఈ ట్రాఫీ టూర్ను ప్లాన్ చేసి ఉండవచ్చని వారు అనుకుంటున్నారు.