BJP : తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ప్రక్షాళనపై బీజేపీ దృష్టి పెట్టింది. రెండు రాష్ట్రాల్లో అధ్యక్షులు మార్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. జేపీ నడ్డా తనకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారని సోము వీర్రాజు వెల్లడించారు. తనకు కొత్త బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఏపీలో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు సత్య కుమార్ కు ఇస్తారని తెలుస్తోంది.
అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి నియమిస్తామని నడ్డా.. బండితో చెప్పారని సమాచారం. ఇలా ఒకేసారి తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సోము వీర్రాజు, బండి సంజయ్ కు ఎలాంటి పదవి ఇస్తారనే అంశంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.