NIA Court: కోడికత్తితో జగన్ పై దాడి చేసిన కేసులో విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. బెయిల్ ఇవ్వాలని నిందితుడు శ్రీనివాస్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. అయితే బెయిల్ అంశం తమ పరిధిలో లేదని ఎన్ఐఏ కోర్టు తేల్చిచెప్పింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించింది.
గతంలో శ్రీనివాస్కు ఎన్ఐఏ కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది. మరోవైపు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని సీఎం వైఎస్ జగన్ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 11కు వాయిదా పడింది.
మరోవైపు కేసు జాప్యంపై నిందితుడు నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. జైల్లోనే దీక్ష చేపడతానని తెలిపాడు. ఈ నెల 11 నుంచి దీక్ష చేస్తానని ప్రకటించాడు. 2018లో విశాఖ ఎయిర్పోర్టులో జగన్పై కోడి కత్తితో శ్రీనివాస్ దాడి చేశాడు. అప్పటి నుంచి నిందితుడు జైల్లోనే ఉన్నాడు.