US : అమెరికాలో భారత్ దౌత్య కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ కు దుండగులు నిప్పు పెట్టారు. ఖలిస్థానీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. 5 నెలల వ్యవధిలో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడం ఇది రెండోసారి. మార్చిలో ఇండియన్ కాన్సులేట్పై దుండగులు దాడికి పాల్పడ్డారు.
దౌత్య కార్యాలయంలో మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ దాడిని అమెరికా ఖండించింది. ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
మార్చిలో భారత్లో ఖలిస్థానీ మద్దతుదారుడు అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు కేంద్రం వేట కొనసాగించింది. ఆ సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు శాన్ఫ్రాన్సిస్కోలో దౌత్య కార్యాలన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. అమృత్పాల్ సింగ్ను వదిలేయాలని నినాదాలు చేశారు. ఇప్పుడు రెండోసారి దాడి జరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.