Ponguleti speech in khammam meeting(Telangana congress latest news): అధికార మదం, అహంకారం విర్రవీగుతున్న కేసీఆర్ను గద్దె దింపాలని పిలుపు ఇచ్చారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ను బంగాళాఖాతంలో కలిపేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసి.. మాయమాటలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్కు ఈసారి ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలన్నారు. ఈసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. రైతు, నిరుద్యోగ డిక్టరేషన్లలో ప్రకటించిన హామీలన్నీ నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు పొంగులేటి.
అంతకుముందు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు రాహుల్ గాంధీ. పొంగులేటితో పాటు పలువురు నేతలు కాంగ్రెస్లో చేరారు. పిడమర్తి రవి, అరికెల నర్సిరెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, డీవీ రావు, పాపిరెడ్డి తదితరులు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
అనంతరం, 109 రోజులు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ సన్మానించారు.
ఖమ్మం సభకు వచ్చిన ప్రజాయుద్ధనౌక గద్దర్.. రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకుని.. ముద్దులు పెట్టడం ఆసక్తి రేపింది.