Khammam Congress Meeting : ఆదివారం ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభకు అధికార పార్టీ నేతలుఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం నగరంలో పలు డివిజన్లో తాగునీటి సరఫరా నిలిపి వేశారు మున్సిపల్ సిబ్బంది. తాజాగా ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.
అదే సమయంలో హై రిచ్.. వెలాసిటీ లాంటి కేబుల్ కనెక్షన్స్లాంటి నెట్వర్క్ సేవలు కూడా ప్రజలకు చేరుకోకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల కనుసనల్లోనే ఉదయం కేబుల్ వైర్లు కట్ చేపించారని కేబుల్ ఆపరేటర్లు చెబుతున్నారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చెరడం.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ… ఈ రెండు సభలను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. మరోవైపు తమకు బ్రేకులు వేసేందుకు అధికార పార్టీ నేతలు ఆటంకాలు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ సభ సక్సెస్ అవుతుందని.. అందుకే అధికార పార్టీ నేతలకు మదిలో కలవరాలు మొదలయ్యాయని.. అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.