EPAPER

CM KCR: పోడు తెలంగాణ.. పట్టాలు పంచిన కేసీఆర్.. గిరివికాసం..

CM KCR: పోడు తెలంగాణ.. పట్టాలు పంచిన కేసీఆర్.. గిరివికాసం..
cm kcr

CM KCR: పోరు తెలంగాణ.. పోడు తెలంగాణగా మారింది. దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న పోడు భూముల సమస్య కొలిక్కి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 1.51 లక్షల రైతులకు.. 4.06 లక్షల ఎకరాలకుపైగా పోడు భూముల పట్టాల పంపిణీ షురూ చేశారు సీఎం కేసీఆర్. పోడు పట్టాలు అన్నింటినీ మహిళల పేరుమీదే అందించడం మరో ప్రత్యేకత.


కుమురంభీం జిల్లాలో.. ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి) నియోజకవర్గంలోని ఆదివాసీలకు పోడు పట్టాలు స్వయంగా పంపిణీ చేశారు కేసీఆర్. పట్టాలతో పాటు రైతుబంధు చెక్కులను కూడా వేదికపైనే అందజేశారు.

పోడు భూములకు పట్టాలు ఇచ్చినందున.. గతంలో అడవులను ఆక్రమించారని గిరిజనులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు సీఎం కేసీఆర్. మారుమూల ప్రాంతాల్లో ఉన్న పోడు భూములకు ఇకపై 3ఫేజ్‌ కరెంట్ సరఫరా చేస్తామని చెప్పారు. ‘గిరివికాసం’ కింద బోర్లు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనేతరులకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


ఆసిఫాబాద్ పర్యటనలో భాగంగా.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కుమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×