YS Jagan Meeting(Andhra news updates): పార్వతీపురం జిల్లాలో అమ్మఒడి కార్యక్రమంలో వైసీపీ నేతలు కునుకు తీశారు. ఓవైపు సీఎం జగన్ మాట్లాడుతుండగానే.. వైసీపీ నెల్లిమర్ల ఎమ్మెల్యే, విజయనగరం ఎంపీ.. స్టేజ్పైనే కునుకు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయ్.
ఎంపీ, ఎమ్మెల్యే తీరుపై వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం మాట్లాతుండగా.. నేతలు ఎలా నిద్రపోతారంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ అంటే భయం లేదా? ఉన్న భయం పోయిందా? అని మాట్లాడుకుంటున్నారు.