Buggana Rajendra Nath(AP updates) : ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి ప్రమాదం తప్పింది. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కనుమకింది కొట్టాలలో పర్యటనకు వెళ్లిన ఆయన బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 70 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంలో బుగ్గనకు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. దాడి నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ను తప్పించేందుకు ఆయన గన్మెన్లు కండువాలను కప్పారు. దీంతో గన్మెన్లకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.