Telugu desam party news(Andhra pradesh today news) : అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తన్నులాటకు దిగారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్న టీడీపీ బస్సుయాత్రలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.
మాజీ ఎంఎల్ఎ హనుమంతరాయ చౌదరికి, ప్రస్తుత టిడిపి ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడుల మధ్య నాలుగేళ్ల నుంచి గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో బస్సు యాత్ర కుందుర్తి మండలంలో జరుగుతున్న సమయంలో ఉమామహేశ్వర నాయుడుపై దాడికి హనుమంతురాయ చౌదరి వర్గీయులు సిద్ధమయ్యారు. ఉమామహేశ్వర్ నాయుడు మాట్లాడిన తర్వాత హనుమంతరాయ చౌదరికి అవకాశం ఇవ్వకుండా బస్సును కదిలించడానికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది.
హనుమంతరాయ చౌదరి వర్గీయులు ఒక్కసారిగా బస్సు ముందుకు వచ్చారు. ఎలా కదిలిస్తారో చూస్తామంటూ అడ్డుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితిలో యాత్ర కొనసాగుతుండడంతో మిగతా నాయకులు తల పట్టుకుంటున్నారు.