Kerala Story Director : కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ అందించడంతో పాటు ప్రేక్షకులకు ఏదో ఒక మెసేజ్ను కూడా అందిస్తాయి. మరికొన్ని సినిమాలు ప్రేక్షకులకు తెలియని చేదు నిజాలను వారి ముందు పెడతాయి. సాధారణంగా ఇలాంటి సినిమాలు అనేక విమర్శలను ఎదుర్కుంటాయి. అలాంటి వాటిలో ఒకటి ఇటీవల విడుదలయిన ‘ది కేరళ స్టోరీ’. ఈ సినిమా హిట్ అయినా కూడా తమకు కష్టాలు తప్పడం లేదని తాజాగా దర్శకుడు ఓ ప్రెస్ మీట్లో బయటపెట్టాడు.
‘ది కేరళ స్టోరీ’ చిత్రం కేరళలోని హిందూ అమ్మాయిల గురించి, బలవంతమైన మత మార్పిడి గురించి తెరకెక్కింది. ఈ చిత్రం విడుదలయిన తర్వాత ఇది నిజమే అని ఒప్పుకోవడానికి పలువురు అమ్మాయిలు ముందుకొచ్చారు. అంతే కాకుండా ఇది క్రియేట్ చేసిన కాంట్రవర్సీ వల్ల మూవీ టీమ్ ఇబ్బందులు కూడా ఎదుర్కున్నారు. అయినా అన్ని విమర్శలను, కాంట్రవర్సీలను దాటి ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సూపర్హిట్గా నిలిచింది. కానీ విడుదలయ్యి ఇన్ని రోజులయినా కేరళ స్టోరీకి ఓటీటీ ఆఫర్లు రావడం లేదు.
ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ ఏవీ కేరళ స్టోరీ చిత్రాన్ని కొనడానికి ముందుకు రావడం లేదని సినీ పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి దర్శకుడు సుదీప్తో సేన్ స్పందించాడు. ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమ్ అవుతుంది అనే ప్రశ్నకు తాను సమాధానం ఇచ్చాడు. అదంతా అబద్ధం అని తేల్చాశాడు. ఇప్పటికీ కేరళ స్టోరీకి ఓటీటీ ఆఫర్లు రాలేదని బయటపెట్టాడు. ఏ ఓటీటీ ప్లాట్ఫార్మ్ నుండి మంచి డీల్ వస్తుందో అని ఇంకా ఎదురుచూస్తున్నామని చెప్పాడు. కానీ ఇప్పటివరకు ఆఫర్లు ఏమీ రాలేదని అన్నాడు.
కేరళ స్టోరీకి ఓటీటీ ఆఫర్లు రాకపోవడం చూసి సినీ పరిశ్రమ అంతా కలిసి శిక్ష వేసినట్టుగా అనిపిస్తుందని సుదీప్తో వాపోయాడు. మా సినిమా సక్సెస్ను కూడా ఇండస్ట్రీలో కొందరు శిక్ష వేస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నాడు. సుదీప్తో వ్యాఖ్యలకు పలు ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ కూడా పరోక్షంగా స్పందించాయి. ఈ సినిమాను కొని, స్ట్రీమ్ చేసి తాము రాజకీయ చిక్కుల్లో ఇరుక్కోదలచుకోలేదని అంటున్నాయి. కానీ దర్శకుడు మాటలు వింటుంటే ఎవరో కావాలనే ఈ రిలీజ్ను ఆపేయాలని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. మరి కేరళ స్టోరీ ఓటీటీ రిలీజ్ ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.